ఎవరీ కిషన్జీ, ఇక్కడి నుంచి ఎక్కడి దాకా నడక?

కిషన్జీ సోదరుడు మల్లోజుల కోటేశ్వర రావు కూడా ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో ఉన్నారు. ఆయన ఛత్తీస్ఘడ్ బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. 1980 దశకంలో ప్రహ్లాద్ పేరుతో కిషన్జీ ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు నిర్వహించారు. కిషన్జీ మరణవార్త వినగానే పెద్దపల్లిలోని ఆయన అన్న ఆంజనేయులు కుప్పకూలిపోయారు. ఆయన బ్యాంకు ఉద్యోగిగా పనిచేసి రిటైర్ అయ్యారు. మరణవార్తను తల్లి మదనమ్మకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. తన మూడు దశాబ్దాల నక్సలైట్ ఉద్యమంలో ఆయన శ్రీధర్, తదితర పలు మారు పేర్లతో పనిచేశారు. ప్రస్తుతం ఆయన పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒరిస్సా, బీహార్ బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
కిషన్జీ కోసం గత నాలుగు రోజులుగా సంయుక్త బలగాలు జంగల్ మహల్ను జల్లెడ పడుతూ వచ్చారు. రెండు రోజుల క్రితం ఆయన స్థావరాన్ని చుట్టుముట్టారు. వెస్ట్ మిడ్నాపూర్ జిల్లా ఖుష్బనీ అడవుల్లో కిషన్జీని హతమయ్యారు. ప్రస్తుతం ఆయనకు 62 ఏళ్లు. కిషన్జీ సంచలనాలకు మారు పేరుగా ఉన్నారు. ఆయన ఓ బడి పంతులు కుమారుడు. అప్పటి పీపుల్స్వార్ అగ్రనేత కొండపల్లి సీతారామయ్య అప్పటి ముఖ్య నేతలు కెజి సత్యమూర్తి అలియాస్ శివసాగర్, ముక్కు సుబ్బారెడ్డి, ఐవి సాంబశివరావులను పక్కన పెట్టి 1980లో మల్లోజులు కోటేశ్వర రావుకు ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు అప్పగించారు. ప్రహ్లాద్ పేరుతో ఆయన బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత 1987లో దండకారణ్యానికి మకాం మార్చారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications