హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ విజయమ్మ బాధపడుతుంటారు: పయ్యావుల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Payyavula Keshav
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వాదన ఇప్పుడు విని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ బాధపడుతుంటారని తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ గురువారం ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు. హైకోర్టును తప్పుదోవ పట్టించే విధంగా విజయమ్మతో పిటిషన్ వేయించారని విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి బినామీ కర్నాటి వెంకటేశ్వర రావు వైయస్ హయాంలోనే వెలుగులోకి వచ్చారన్నారు. కర్నాటి, కెవిపి రామచంద్రా రావు ఒకే భవనంలో ఉంటారన్నారు.

కాకినాడ పోర్టు విషయంలో తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదన్నారు. కాకినాడ పోర్టు అడిగిన అన్ని మినహాయింపులు, రాయితీలు ఆమోదించింది వైయస్ ప్రభుత్వమేనని, కెవిపి మీద విచారణ ఎందుకు వేయలేదో జగన్ చెప్పాలని పయ్యావుల ప్రశ్నించారు. విజయమ్మ పిటిషన్ పూర్తిగా తప్పుల తడక అన్నారు.

English summary
TDP senior MLA Payyavula Keshav said today that YS Vijayamma felt very sad for her petition after arguments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X