కొడుకు మరణవార్తతో కుప్పకూలిన కిషన్జీ తల్లి

కిషన్జీ మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు డిమాండ్ చేశారు. అంత్యక్రియల కోసం కిషన్జీ మృతదేహాన్ని తమకు అప్పగించాలని ఆయన కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కిషన్జీ మరణవార్త వినగానే విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు ఏడ్చేశారు. కిషన్జీ మృతదేహం కోసం ఆయన కోల్కతా బయలుదేరి వెళ్లారు. కిషన్జీ 1953 అక్టోబర్ 10వ తేదీన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఉస్మానియా ఆస్పత్రి నుంచి 1984లో అప్పటి పీపుల్స్వార్ అగ్రనేత కొండపల్లి సీతారామయ్యను తప్పించడంలో కిషన్జీ ప్రధాన పాత్ర పోషించాడని అంటారు.












Click it and Unblock the Notifications