వార్తా శీర్షికలను తప్పు పట్టిన కిరణ్ కుమార్ రెడ్డి

kiran kumar reddy
హైదరాబాద్: మీడియా వార్తలకు పెడుతున్న శీర్షికలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాఠం చెప్పారు. ఆయన శనివారం ఇండియన్ జర్నలిస్టు యూనియన్ (ఐజెయు) ఏడో ప్లీనరీ సమావేశంలో మాట్లాడారు. వార్తలకు పెడుతున్న శీర్షికలను ఆయన తప్పు పట్టారు. వార్తలకు పెడుతున్న శీర్షికలకు, వార్తల వివరణకు సంబంధం ఉండడం లేదని ఆయన అన్నారు. వార్తలకు పెడుతున్న శీర్షికలను ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నాయని ఆయన విమర్శించారు. మీడియా విశ్వసనీయత పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

వార్తకు, అభిప్రాయాలకు తేడా ఉందని, ఈ తేడాని మీడియా పాటించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ప్రింట్ మీడియా అయినా, విజ్యువల్ మీడియా అయినా విశ్వసనీయతను పెంచుకోవడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రింట్ మీడియాలో మాదిరిగానే విజ్యువల్ మీడియాలో కూడా జర్నలిస్టులకు వేతనం, ఉద్యోగ భద్రత ఉండేలా చూడడానికి తాము ప్రయత్నాలు చేస్తామని ఐజెయు ప్లీనరీ ఆహ్వాన సంఘం అధ్యక్షుడు కె. శ్రీనివాస రెడ్డి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+