కిషన్జీని మమతా బెనర్జీ చంపేసింది: వరవరరావు

శాంతిని కోరిన కిషన్జీని మమతా బెనర్జీ చంపారని ఆయన మీడియా ప్రతినిధుల వద్ద వ్యాఖ్యానించారు. కిషన్జీ మృతదేహానికి మిడ్నాపూర్ వైద్య కళాశాల, ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిగింది. కిషన్జీ ఎన్కౌంటర్లోనే మరణించాడని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు. కిషన్జీ మృతదేహంపై 20 చోట్ల గాయాలున్నాయని వారు చెప్పారు. కిషన్జీ మృతదేహాన్ని మిడ్నాపూర్ నుంచి హైదరాబాదు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాదు నుంచి ఆయన స్వస్థలం కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి తరలిస్తారు. కాగా, కిషన్జీ ఎన్కౌంటర్కు నిరసనగా మావోయిస్టులు రెండు రోజుల పశ్చిమ బెంగాల్ బంద్కు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications