రామోజీరావు జర్నలిజంపై జగన్ సాక్షి డైలీ అటాక్

తనపై విచారణ వార్తకు ప్రాధాన్యం తగ్గించడానికి సాక్షి దరువు - డెలాయిట్ చిందు అంటూ ఈనాడులో గత 10, 11 తేదీల్లో రాసిన పాత కథనాలనే శీర్షికగా రామోజీ రావు కలిపికొట్టారని సాక్షి దినపత్రిక విమర్శించింది. రూ. 100 షేరును రూ. 5.28,830 చొప్పున కంపానీకి రామోజీ కట్టబెట్టాడని ఆరోపించింది రూ. 1,800 కోట్ల నష్టాలున్నా ఈనాడు విలువను రూ. 7,000 కోట్లుగా నిర్ధారించారని, దొంగే దొంగ అన్నట్లుగా రామోజీ రావు సాక్షిపై వార్తాకథనాలు రాశారని సాక్షి వార్తాకథనం వ్యాఖ్యానించింది. జగన్పై ఈనాడు దినపత్రిక చేసిన ఆరోపణలకు వివరణ ఇచ్చింది. రామోజీ రావు బాధ సాక్షిలో పెట్టుబడులు పెట్టివారి గురించా, లేక సాక్షి నిటారుగా నిలబడి తన దాష్టీకాలను బట్టబయలు చేస్తున్నందుకా అని ప్రశ్నించింది.












Click it and Unblock the Notifications