రాజకీయాల్లోకి రండి: యువతకు సోనియాగాంధీ పిలుపు

ప్రజలకు ఉపకారం చేసేది, భారత్ అవసరాలు తీర్చేది కేవలం కాంగ్రెసేనని, ఆ కాంగ్రెసుకు మూలాధారం యూత్ కాంగ్రెసు అన్నారు. కాంగ్రెసుకు ఆశ, శ్వాస కార్యకర్తే అన్నారు. సమగ్ర విధానం తర్వాతే ఎఫ్డిఐ రూపకల్పన జరిగిందని ప్రతిపక్షాలు దీనిని అనవసర రాద్దాంతం చేస్తున్నాయన్నారు. ఎఫ్డిఐ వల్ల చిన్న వ్యాపారులు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. ఇది రిటైల్ రంగానికి దోహద పడుతుందని, కొత్త చట్టాలు తేవాలని ప్రయత్నిస్తుంటే విపక్షాలు అడ్డుకుంటున్నాయని విమర్శించారు. యువ కాంగ్రెసును రాహుల్ పటిష్ట పరిచారన్నారు. ధరలు తగ్గుతాయని తాను ఆశిస్తున్నానని, ద్రవ్యోల్భణ కట్టడికి అనేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కాగా సర్జరీ తర్వాత సోనియా మొదటిసారి బహిరంగ సభలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications