లీకులపై ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు హైకోర్టు తాఖీదులు?

ఎమ్మార్ వద్ద ప్లాట్లు కొనుగోలు చేసిన వారి పట్ల ప్రజల్లో ద్వేషభావం కలిగేలా, సిబిఐ దర్యాఫ్తునకు సంబంధించి అతి సున్నితమైన అంశాలను ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు చేరవేస్తున్నారని విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ఆ పత్రికలు ప్రచురించిన వార్తలను సిబిఐ ఇప్పటి వరకు ఖండించలేదని పేర్కొన్నారని తద్వారా లీకులపై అనుమానం కలుగుతోందన్నారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి ఈనాడు, ఆంధ్రజ్యోతి యాజమాన్యాలకు, కేంద్రం హోంశాఖ కార్యదర్శి, సిిబఐ డైరెక్టర్, సిబిఐ జాయింట్ డైరెక్టర్, ఎమ్మార్ హిల్స్ టౌన్ షిప్స్ ప్రయివేట్ లిమిటెడ్ తదితరులకు నోటీసులు జారీ చేసినట్లుగా పేర్కొన్నారు. పిటిషన్లో లేవనెత్తిన అంశాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని కోర్టు ముందు ఉంచాలని సిబిఐ తరఫు న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణను వచ్చే నెలకు వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications