వైయస్సార్ను అనుకరిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి

పథకాలను ప్రవేశపెట్టి వాటిని ప్రజల్లోకి తీసుకుని వెళ్లడంలో కూడా ఆయన వైయస్సార్నే తలపిస్తున్నారు. రూపాయికి కిలో బియ్యం పథకం విషయంలోనూ, రాజీవ్ యువకిరణాలు పథకం విషయంలోనూ ఆయన వ్యవహరించిన తీరు మనకు ఈ విషయం అర్థమవుతుంది. కొంత మంది మంత్రులను, శాసనసభ్యులు నమ్మకంగా తన వైపు ఉంచుకుని మిగతావారిని తనకు అనుగుణంగా నడుచుకునేలా చేయడం వైయస్ పద్ధతి. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డికి మంత్రులు శైలజానాథ్, విప్ కొండ్రు మురళి వంటివారు అత్యంత సన్నిహితులుగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డిని కూడా వైయస్ను కొంత మంది వెనకేసుకొస్తూ ఉన్నట్లుగానే ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డిని వెనకేసుకొచ్చేవారు కూడా తయారవుతున్నారు.
కిరణ్ కుమార్ రెడ్డిని అవినీతిరహితుడిగా, మచ్చ లేని నాయకుడిగా నిలబెట్టే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్లు అర్థమవుతోంది. వైయస్ రాజశేఖర రెడ్డిపై ఏదో మేరకు అవినీతి ముద్ర పడింది. దానికి మాత్రం ఆయన దూరంగా ఉన్నట్లు చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవినీతిరహిత ప్రభుత్వాన్ని అందిస్తున్న ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డిని చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications