తెలంగాణ ఇప్పటికిప్పుడు తేలదు: నీళ్లు చల్లిన డిఎస్

D Srinivas
న్యూఢిల్లీ: తెలంగాణపై నిర్ణయం విషయంలో తెలంగాణవాదుల ఆశలపై పిసిసి మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి. శ్రీనివాస్ నీళ్లు చల్లారు. తెలంగాణ అంశం ఇప్పటికిప్పుడు తేలదని ఆయన కచ్చితంగా చెప్పేశారు. తెలంగాణపై ఇప్పటికిప్పుడు కేంద్రం నిర్ణయం తీసుకోబోదని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రాంతీయ మండలి ఏర్పాటు ఆలోచన కేంద్రం వద్ద లేదని ఆయన అన్నారు. ఢిల్లీలో ఆయన గురువారం కాంగ్రెసు పార్టీ పెద్దలను కలుస్తూ బిజీగా గడిపారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలిశారు. తాను వారిద్దరిని మర్యాదపూర్వకంగానే కలిశానని ఆయన చెప్పారు. అయితే, రాష్ట్రంలోని తాజా పరిస్థితులను ఆయన వివరించినట్లు సమాచారం. పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌తోనూ కేంద్రం మంత్రి ఎకె ఆంటోనీతోనూ ఆయన సమావేశమయ్యారు.

సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కూడా గులాం నబీ ఆజాద్‌ను కలిశారు. పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత తెలంగాణపై యుపిఎ భాగస్వామ్య పక్షాలతోనూ ఇతర పార్టీలతోనూ సంప్రదింపులు జరుపుతామని ఆజాద్ ఇటీవల చెప్పారు. కాంగ్రెసు పార్టీ నాయకుల మాటలను బట్టి తెలంగాణ అంశాన్ని అటక ఎక్కించేందుకే సిద్దపడినట్లు అర్థమవుతోంది. అప్పుడు, ఇప్పుడు అంటూ 2004 ఎన్నికల వరకు కూడా లాగాలనేది కాంగ్రెసు పెద్దల ఆలోచనగా కనిపిస్తోంది. కాగా, తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు పార్లమెంటు వద్ద గురువారంనాడు కూడా నిరసన వ్యక్తం చేశారు. సాధ్యమైనంత త్వరగా తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని సర్వే సత్యనారాయణ సోనియాను కోరారు. రెండేళ్ల క్రితం సోనియా తన జన్మదిన కానుకగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేయించారని, ఇప్పుడు అ ప్రకటనను అమలు చేస్తున్నట్లు ప్రకటన చేయాలని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+