వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై తుది నిర్ణయం పార్లమెంటుదే: ఉండవల్లి

By Pratap
|
Google Oneindia TeluguNews

Undavalli Arunkumar
న్యూఢిల్లీ: తెలంగాణపై తుది నిర్ణయం పార్లమెంటుదేనని, పార్లమెంటు నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. పార్లమెంటు తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రాష్ట్ర విభజనకు, కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధం లేదని ఆయన అన్నారు. పాలనా సౌలభ్యం కోసం చిన్న జిల్లాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కొత్త జిల్లాలు ఏర్పడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తెలంగాణ అంశం రాష్ట్రం నుంచి కేంద్రానికి వచ్చిందని, కేంద్రం ఏం చేస్తుందనేది చూడాలని ఆయన అన్నారు.

తెలంగాణపై ఏం చేయాలనేది కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ చెప్తారని ఆయన ఆన్నారు. కేంద్రం తీసుకునే నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించడానికి వీలు లేదని ఆయన అన్నారు. తెలంగాణపై అందరీకి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. విప్ ధిక్కరించిన శానససభ్యులపై చర్చలు తప్పవని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులపై చర్యలు తీసుకుని ఉప ఎన్నికలకు వెళ్తే పార్టీ తీరు మెరుగు పడుతుందని ఆయన అన్నారు.

English summary
Parliament decision on Telangana will be final, nobody can defy it, said Seemandhra MP Undavalli Arunkumar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X