వేటు వేయాలని ఫిర్యాదు: కాంగ్రెసు వర్సెస్ జగన్ వర్గం!

కాంగ్రెసులో స్వేచ్ఛ ఉందని, రైతుల కోసం కిరణ్ ప్రభుత్వం చాలా చేస్తుందన్నారు. ప్రజలు జగన్ మాట నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. జగన్ ఎమ్మెల్యేలు ప్రజా విశ్వాసం కోల్పోతున్నారన్నారు. పార్టీలో చర్చించాకే సోమారపు సత్యనారాయణపై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. క్రమశిక్షణా రాహిత్యాన్ని కాంగ్రెసు క్షమించదని మంత్రి శైలజానాథ్ అన్నారు. కాగా తాను స్వతంత్ర ఎమ్మెల్యేనని తనపై వేటు వేసే అధికారం లేదని సోమారపు చెబుతున్నారు.
తమపై ఫిర్యాదు చేశారన్న అంశంపై శోభా నాగి రెడ్డి, చెన్నకేశవ రెడ్డి స్పందించారు. తాము ఉప ఎన్నికల్లో తేల్చుకుంటామని చెబుతున్నారు. పిఆర్పీని కాంగ్రెసులో విలీనం చేసిన సమయంలోనే తాను స్వతంత్ర ఎమ్మెల్యేగా కొనసాగుతానని స్పీకర్కు లేఖ రాశానని అలాంటప్పుడు తనపై వేటు ఎలా వేస్తారని శోభా నాగి రెడ్డి ప్రశ్నించారు. ఇది ఏ రకమైన నీతికి నిదర్శనమని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications