జగన్ సెంటిమెంట్ తగ్గుతోంది, తెలంగాణ తర్వాతే: జెసి

jc diwakar reddy
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి సోమవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణపై స్పందించారు. జగన్ సెంటిమెంట్ రోజు రోజుకు తగ్గుతోందన్నారు. ఉప ఎన్నికల్లో మంచి అభ్యర్థులను నిలబెడితే కాంగ్రెసు పార్టీయే మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటుందన్నారు. అవిశ్వాస తీర్మానం తర్వాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బలపడ్డారని అన్నారు. ప్రభుత్వం మైనార్టీలో పడలేదన్నారు. 2014 వరకు కిరణ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని చెప్పారు. తెలంగాణ తేల్చాకే కేబినెట్ విస్తరణ ఉంటుందని అభిప్రాయపడ్డారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ అనడం సరికాదన్నారు.

జగన్‌కు ఉప ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారని మంత్రి బాలరాజు వేరుగా అన్నారు. దివంగత వైయస్‌ను కాంగ్రెసు ఎప్పుడూ అగౌరవపర్చలేదన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ గెలుపు ఖాయమన్నారు. ఫలితాలకు ప్రభుత్వం, పార్టీ సమష్టి బాధ్యత వహిస్తుందన్నారు. జగన్ సానుభూతి పని చేయదని, ఏ పరిస్థితిల్లో ఉప ఎన్నికలు వచ్చాయో ప్రజలకు తెలుసునన్నారు. జగన్ వెంట 16 మంది ఎమ్మెల్యేలు వెళ్లడంలో పార్టీ వైఫల్యం లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+