నాకు రాజకీయాలు రావు, కల్మషం లేదు: వైయస్ జగన్

YS Jagan
గుంటూరు: తనకు రాజకీయాలు చేయడం తెలియదని, కల్మషం లేని మనసు అని తనకు చేతనైంత వరకు సాయం చేయడమే తెలుసని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం గుంటూరు జిల్లా ఓదార్పు యాత్రలో అన్నారు. ఉప ఎన్నికల ద్వారా రాష్ట్రంలో రైతులు పడుతున్న కష్టాలను, పేదవాడు పెడుతున్న కన్నీళ్లను ఢిల్లీ పెద్దలకు చూపిస్తానన్నారు. చంద్రబాబు ఏ ఉద్దేశ్యంతో అవిశ్వాసం పెట్టినా విలువల కోసం నిలబడాలని తన ఎమ్మెల్యేలకు చెప్పానన్నారు. అవిశ్వాసానికి మద్దతు తెలిపితే వారిపై వేటు పడుతుందని ముందే తెలుసునని అయినా ప్రజల పక్షాన ఉండాలని నిర్ణయించుకున్న ఎమ్మెల్యేలు అనర్హతకు బెదరలేదన్నారు. విలువలకు కట్టుబడి ఉండాలని తాను వారికి చెప్పానన్నారు. విలువలు, విశ్వసనీయతకు పట్టం కట్టిన ఎమ్మెల్యేలకు సెల్యూట్ చేస్తున్నానన్నారు.

రైతులపై చంద్రబాబువి మొసలి కన్నీళ్లని ఆరోపించారు. ఆరు నెలల క్రిందటే టిడిపి అవిశ్వాసం పెడితే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం జల్ తుఫాన్‌‍లో కొట్టుకు పోయేదన్నారు. అప్పటికి చిరంజీవి తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేయలేదని చెప్పారు. అసెంబ్లీలో అవిశ్వాసం పెట్టి దివంగత వైయస్ గురించి మాట్లాడటం విచారకరమన్నారు. తన ఎమ్మెల్యేలను సింగిల్ డిపాజిట్‌కు కట్టడి చేయాలని కిరణ్, బాబు కుమ్మక్కై అవిశ్వాస తీర్మానం పెట్టారని ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+