ప్రధానికి అన్నాహజారే లేఖ, లోక్పాల్ బిల్లుపై సందేహం

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో పటిష్టమైన లోక్పాల్ బిల్లును ప్రవేశపెడతామని గత కొన్ని నెలలుగా తనకు రాసిన లేఖల్లో ప్రధాని హామీ ఇస్తూ వచ్చారని ఆయన గుర్తు చేశారు. ఏడాది పాటుగా ప్రభుత్వం లోక్పాల్ బిల్లుపై హామీలు ఇస్తూ కూడా దేశ ప్రజలను మోసం చేస్తోందని ఆయన విమర్శించారు. ప్రధాని మాటను నమ్మి తాము పార్లమెంటు శీతాకాలం సమావేశాల వరకు తమ ఆందోళనలను ఆపేశామని ఆయన చెప్పారు. ఈ శీతాకాలం సమావేశాల్లో లోక్పాల్ బిల్లు ప్రవేశపెడుతారనే నమ్మకం లేకుండా పోయిందని ఆయన అన్నారు.ఈ పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ప్రతిపాదించకపోతే తాను డిసెంబర్ 27వ తేీదన దీక్షకు దిగుతానని, డిసెంబర్ 30వ తేదీ నుంచి జైల్ భరో కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications