జనగ్ ప్రతి విమర్శ వైయస్కే తగులుతుంది: ఆనం

రాష్ట్రాన్ని పాలించాలని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ వైయస్ రాజశేఖర రెడ్డికి అవకాశం ఇచ్చారని ఆయన అన్నారు. వైయస్ హయాంలో పేరుకుపోయిన ఫీజు బాకీలు కిరణ్ కుమార్ రెడ్డి విడుదల చేశారని ఆయన చెప్పారు. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, కోవూరు ఉప ఎన్నికల్లో స్థానికులకే ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. వైయస్ అధికారంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు బోధనా ఫీజుల కింద రూ.5,400 కోట్లు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. జగన్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రతిష్టను మంట గలుపుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
కాగా, ఆనం సోదరులు రామనారాయణ రెడ్డి, వివేకానంద రెడ్డిలపై వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర రెడ్డి ధ్వజమెత్తారు. వేటు తప్పదు కాబట్టి తాము ఉప ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తుందని ఆయన అన్నారు. వీర ప్రగల్భాలు పలుకుతున్న ఆనం సోదరులు ఉదయగిరిలో కాంగ్రెసు అభ్యర్థిని పెట్టాలని ఆయన సవాల్ చేశారు. ఉప ఎన్నికల్లో ప్రజలే ఆనం సోదరులకు బుద్ధి చెప్తారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications