తెలంగాణలో ఓదార్పు,జగన్ సిఎం కావాలనుకుంటే: గట్టు

Gattu Ramachandra Rao
మెదక్/నెల్లూరు: తెలంగాణ ప్రాంతంలో త్వరలో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేపడతారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత గట్టు రామచంద్రా రావు ఆదివారం అన్నారు. మెదక్ జిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా గట్టు మాట్లాడారు. తెలంగాణలో జగన్ ఓదార్పు యాత్ర నిర్వహిస్తారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశ్యం ఉండి ఉంటే 150 మంది ఎమ్మెల్యేలు, 36 మంది మంత్రులు సంతకాలు పెట్టిన రోజే అయ్యే వారన్నారు. ప్రజల నుండి రావాలన్నదే ఆయన కోరిక అన్నారు.

కాగా అంతకుముందు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర రెడ్డి ఆనం సోదరులకు సవాల్ విసిరారు. ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలలో ఎవరెంత అభివృద్ధి చేశారో తేల్చుకునేందుకు చర్చకు రావాలన్నారు. ఆనం సోదరులకు దమ్ముంటే ఉదయగిరిలో తనపై పోటీకి దిగాలన్నారు. శాసనసభలో అవిశ్వాసం పెట్టింది దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిని తిట్టడానికా అని ప్రశ్నించారు. సిఎం పీఠం కోసం పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మపై అవాకులు చవాకులు పేలారన్నారు. అవిశ్వాసం టిడిపి కాంగ్రెసు కుట్ర అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+