వైయస్ జగన్ ఝలక్, తెలంగాణ నేతల తర్జన భర్జన

YS Jaganmohan Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు తెలంగాణ ప్రాంతంలోని నేతలకు మింగుడు పటడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. శనివారం లోటస్ పాండులో పార్టీ కేంద్ర పాలక మండలితో సమావేశమైన జగన్ పార్టీ నేతలతో తెలంగాణపై ఎవరూ ఏమీ మాట్లాడవద్దని, తెలంగాణపై కేంద్రం ఓ నిర్ణయం తీసుకునే వరకు మీరెవరూ ఆ అంశం లేవనెత్తవద్దని ఆదేశించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తన వర్గం ఎమ్మెల్యేలపై వేటు పడే ఆస్కారం ఉన్న నేపథ్యంలో ఆయన కేవలం సీమాంధ్ర ఉప ఎన్నికలపై మాత్రమే చర్చించారట. తెలంగాణ జిల్లాల్లోని ఆరు స్థానాలతో పాటు తన వర్గం ఎమ్మెల్యే కొండా సురేఖపై వేటు పడితే వచ్చే ఖాళీ పైన కూడా చర్చించేందుకు ఆయన సుముఖత చూపలేదట. తెలంగాణలో జరిగే ఉప ఎన్నికలపై ఎవరూ మాట్లాడవద్దని జగన్ ఆదేశించారట.

దీంతో ఇన్నాళ్లూ జగన్ నిర్ణయం కోసం వేచి చూసిన జగన్ వర్గం తెలంగాణ ప్రాంత నాయకులు, కార్యకర్తలు తర్జన భర్జన పడుతున్నారట. కొండా సురేఖ నియోజకవర్గంతో పాటు మిగిలిన నియోజకవర్గాలలో పోటీ చేసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సత్తా చూపించాలనే గట్టి విశ్వాసంతో ఆ ప్రాంత నాయకులు ఉన్నారు. ఇలాంటి సమయంలో కేవలం సీమాంధ్ర ఉప ఎన్నికల పైనే దృష్టి పెట్టడం వారు జీర్ణించుకోలేక పోతున్నారని సమాచారం. దివంగత వైయస్‌కు ఉన్న ఇమేజ్ ద్వారా పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందనే విశ్వాసం వారిలో ఉంది. అలాగే ఇప్పటి వరకు సీమాంధ్రకే పరిమితమైన జగన్, తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలంటే ఉప ఎన్నికలే మంచి తరుణమని వారు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+