వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కౌంటర్ వేయండి: ఐఎఎస్ శ్రీలక్ష్మికి హైకోర్టు ఆదేశం

By Pratap
|
Google Oneindia TeluguNews

Srilakshmi
హైదరాబాద్: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి గనుల అక్రమ తవ్వకాల కేసులో ఐఎఎస్ శ్రీలక్ష్మి బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సిబిఐ దాఖలు చేసిన పిటిషన్‌‌ను హైకోర్టు సోమవారం విచారణకు స్వీకరించింది. సిబిఐ వేసిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు శ్రీలక్ష్మికి నోటీసులు జారీ చేసింది. సిబిఐ పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది. ఆరోగ్య కారణాల రీత్యా సిబిఐ ప్రత్యేక కోర్టు శ్రీలక్ష్మికి బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. బెయిల్‌పై శ్రీలక్ష్మి జైలు నుంచి విడుదలయ్యారు. శ్రీలక్ష్మికి బెయిల్ ఇవ్వడాన్ని సిబిఐ వ్యతిరేకిస్తోంది. తమ విచారణలో శ్రీలక్ష్మి తమకు ఏ విధమైన సమాచారం చెప్పలేదని సిబిఐ కోర్టుకు తెలిపింది.

కాగా, అక్రమ మైనింగ్ కేసులో తన రిమాండ్‌ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. గాలి జనార్దన్ రెడ్డి పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. కాగా, గాలి జనార్దన్ రెడ్డిని తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాలని సిబిఐ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా హైకోర్టు సోమవారం కొట్టేసింది.

English summary
High Court ordered IAS officer Srilakshmi to file counter on CBI petition in Gali Janardhan Reddy's illegal mining case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X