పార్టీయే లేదు, విప్ ధిక్కరించడమేమిటి?: శోభా నాగిరెడ్డి

sobha nagi reddy
హైదరాబాద్: అసలు ప్రజారాజ్యం పార్టీ అనేదే లేనప్పుడు నేను విప్ ధిక్కరించడమనే ప్రశ్న ఎక్కడిదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగి రెడ్డి సోమవారం మీడియాతో అన్నారు. ఆమె ఉదయం స్పీకర్ నాదెండ్ల మనోహర్ ముందు హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పిఆర్పీ ఇచ్చిన విప్‌ ధిక్కారణ పిటిషన్‌కు వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని స్పీకర్ తనకు చెప్పారన్నారు. అసలు పిఆర్పీ పార్టీయే లేనప్పుడు తాను ఎవరికి వివరణ ఇవ్వాలన్నారు. ఎలక్షన్ కమిషన్ గుర్తు కూడా లేదని ఇప్పటికే చెప్పిందన్నారు. తనకు విప్ ఇచ్చిన వారు కూడా కాంగ్రెసు ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారని అలాంటప్పుడు తనను వివరణ కోరే నైతిక హక్కు వారికి ఎక్కడిది అన్నారు.

తాను ఉప ఎన్నికలకు భయపడటం లేదని, అయితే నా మీద చర్యలు తీసుకునే హక్కు పైనే పోటీ చేస్తున్నానన్నారు. జగన్‌తో ఉన్న ఏ ఎమ్మెల్యే ఎన్నికలకు భయపడటం లేదన్నారు. ఈ అంశంపై కోర్టుకు వెళ్లాలా లేదా అనే విషయం
స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆలోచిస్తామన్నారు. ఈసిలో లేకుండా అసెంబ్లీలో పార్టీ ఉండటం పట్ల నిర్ణయం తీసుకోవడం స్పీకర్‌కు క్లిష్టమే అన్నారు. తాను మొదటి నుండి పిఆర్పీ విలీనానికి వ్యతిరేకమన్నారు. రైతుల కోసమే తాము అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+