వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ క్యాంప్ ఎంపి మేకపాటికి స్పీకర్ నోటీసు

By Pratap
|
Google Oneindia TeluguNews

Mekapati Rajamohan Reddy
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డికి లోకసభ స్పీకర్ మీరా కుమార్ నోటీసు జారీ చేశారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంపై ఆమె సోమవారం ఈ నోటీసును జారీ చేశారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి మంగళవారం తన రాజీనామా లేఖపై స్పీకర్ ఎదుట హాజరు కానున్నారు. ఈ సందర్భంగా నోటీసుకు ఆయన వివరణ ఇస్తారని చెబుతున్నారు.

కాగా, వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ ఎఫ్ఐఆర్‌లో వైయస్ రాజశేఖర రెడ్డి పేరు చేర్చడాన్ని నిరసిస్తూ మేకపాటి రాజమోహన్ రెడ్డి తన లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామాను ఆమోదించాలని మేకపాటి రాజమోహన్ రెడ్డి గతంలో స్పీకర్‌ను కోరారు. రాజీనామాపై నిర్ణయం తీసుకునే ముందు స్పీకర్ మీరా కుమార్ మేకపాటి రాజమోహన్ రెడ్డి వివరణను వింటారు. ఆపై నిర్ణయం తీసుకుంటారు.

English summary
Loksabha speaker Meirakumar has served notice to YS Jagan camp MP Mekapati Rajamohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X