ముఖ్యమంత్రిపై తీవ్రంగా మండిపడిన చంద్రబాబు

ఎమ్మార్పీ రేట్లకే మద్యాన్ని విక్రయించాలని ఆయన డిమాండ్ చేశారు. మద్యం సిండికేట్లను నియంత్రించాల్సింది పోయి ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని ఆయన అన్నారు. ఈ వ్యవహారాన్ని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తేలిగ్గా కొట్టిపారేశారని ఆయన అన్నారు. ఎసిబి దాడుల్లో బయటపడినవారి పేర్లను ఎందుకు వెల్లడించడం లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా క్షీణించిందని ఆయన అన్నారు. మద్య నిషేధం విధించాలని గ్రామాల్లోని ప్రజలు కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. మొత్తం 50 వేల కోట్ల రూపాయల అక్రమ మద్యం విక్రయాలు జరిగాయని ఆయన ఆరోపించారు. మద్యం సిండికేట్ల ప్రజల రక్తం తాగుతున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సిండికేట్ మంత్రులను వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications