రోడ్డు ప్రమాదంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడి మృతి

హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు సమీపంలోని సర్వీసు రోడ్డులో ఈ ప్రమాదం సంభవించింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబానిది నల్లగొండ జిల్లా. కుటుంబ సభ్యులంతా హైదరాబాదులోని జూబ్లీహిల్స్లో ఉంటున్నారు. ప్రతీక్ రెడ్డి సిబిఐటిలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే జూబ్లీహిల్స్లోని ఇంటి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి బయలుదేరారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం ఉదయమే ఢిల్లీకి వెళ్లారు. సమాచారం తెలిసిన వెంటనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీ నుంచి బయలుదేరారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు, పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. నల్లగొండలోని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటి వద్ద విషాద వాతావరణం నెలకొంది. అక్కడి నుంచి కాంగ్రెసు కార్యకర్తలు, ఇతరులు హైదరాబాదు బయలుదేరారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటీవల మంత్రి పదవికి రాజీనామా చేసి, నిరాహార దీక్ష చేపట్టారు. ఆయనకు ఓ కూతురు, ఓ కుమారుడు ఉన్నారు. కుమారుడు ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications