వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయాలపై చిరంజీవి నో కామెంట్, విశాఖ పర్యటన

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
విశాఖపట్నం: కాంగ్రెసు నాయకుడు చిరంజీవి రాజకీయాలపై మాట్లాడడానికి నిరాకరించారు. దీన్నిబట్టి ఆయన రాజకీయాలపై వైరాగ్యం వచ్చేసిందని కాదు, పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా అవతారమెత్తిన ఆయన బుధవారం మాత్రం రాజకీయాలపై ప్రతిస్పందించడానికి తిరస్కరించారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన విశాఖపట్నం వచ్చారు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కానీ, ఆయన రాజకీయాలపై మాట్లాడడానికి నిరాకరించారు. ఢిల్లీ పర్యటనపై, ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులకు దక్కబోయే పదవులపై, తనకు దక్కే పదవిపై వేడి వేడి సమాచారం ఇస్తారని భావించిన మీడియా ప్రతినిధులకు నిరాశే మిగిలింది.

విశాఖపట్నం ప్రజలు తనను ఇతోధికంగా ఆదరిస్తున్నారని ఆయన అన్నారు. తన పట్ల అపారమైన అభిమానం చూపుతున్న విశాఖపట్నం ప్రజలకు కృతజ్ఞతలు చెప్తున్నానని ఆయన అన్నారు. ఓ సదస్సులో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లిన ఆయన ఇక్కడికి తిరిగి వచ్చారు. ఢిల్లీలో రాజకీయాలను ఆయన ఘాటుగానే పండించినట్లు వచ్చిన వార్తలను బట్టి అర్థమవుతోంది. తన శాసనసభ్యులకు మంత్రి పదవులు ఇప్పించుకోవడంలో ఆయన ఫలితం సాధించారని అంటున్నారు. డిసెంబర్ నెలాఖరులో మంత్రి వర్గ విస్తరణ జరిపి ముఖ్యమంత్రి ముగ్గురు ప్రజారాజ్యం శాసనసభ్యులను మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది.

English summary
Congress leader Chiranjeevi has rejected speak about politics in Vishakapatnam tour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X