మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ మౌనం తుఫాను ముందు ప్రశాంతత: హరీష్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Harish Rao
మెదక్: టిఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మౌనం తుఫాను ముందు ప్రశాంతత వంటిదని ఆ పార్టీ సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు శుక్రవారం అన్నారు. డిసెంబర్ 23ను తెలంగాణ విద్రోహ దినంగా పాటించాలన్న జెఏసి పిలుపు మేరకు ఆయన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ విషయంలో నమ్మక ద్రోహానికి పాల్పడిన కేంద్రానికి షాకిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెసు, టిడిపిలకు భవిష్యత్తు లేదన్నారు. ఉనికి కోసమే టిడిపి నేతలు తిట్ల పురాణం అందుకుంటున్నారని విమర్శించారు.

డిసెంబర్ 23 తెలంగాణ ప్రజలకు చీకటి రోజన్నారు. తెలంగాణపై ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుంటే కాంగ్రెసు నేతలు చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నారు. తెలంగాణపై కాంగ్రెసు నేతలు ఒక్కరొక్కరు ఒక్కో తిరుగా మాట్లాడతున్నారని విమర్శించారు. యుపిఏ ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ఉందన్న ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణపై డిసెంబర్ 9వ తేదిన ఇచ్చిన మాటపై పెదవి విప్పాలన్నారు. తెలంగాణ విషయంలో కావాల్సింది మాటలు కాదని యాక్షన్ కావాలన్నారు. పార్లమెంటులో బిల్లు పెడితేనే తెలంగాణ ప్రజలు నమ్ముతారన్నారు.

కాంగ్రెసు, టిడిపి వైఖరి వల్లే డిసెంబర్ 23 ప్రకటన వచ్చిందని ఆరోపించారు. డిసెంబర్ 7న తెలంగాణకు అనుకూలమన్న చంద్రబాబు డిసెంబర్ 9న ప్రకటన రాగానే మాట మార్చారని ఆరోపించారు. కిరణ్, రోశయ్య, చంద్రబాబుల కుట్ర కారణంగానే కేంద్రం వెనక్కి పోయిందని మండిపడ్డారు. కాగా తెలంగాణ జిల్లాలలోని పలు చోట్ల జెఏసి ఆధ్వర్యంలో కేంద్రం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. విద్రోహ దినం ర్యాలీలలో బిజెపి, టిఆర్ఎస్ తదితర పార్టీ నేతలు పాల్గొన్నారు.

English summary
TRS MLA Harish Rao clarified about party chief K Chandrasekhar Rao silence. He accused Chandrababu for december 23 statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X