కెసిఆర్ మౌనం తుఫాను ముందు ప్రశాంతత: హరీష్
డిసెంబర్ 23 తెలంగాణ ప్రజలకు చీకటి రోజన్నారు. తెలంగాణపై ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుంటే కాంగ్రెసు నేతలు చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నారు. తెలంగాణపై కాంగ్రెసు నేతలు ఒక్కరొక్కరు ఒక్కో తిరుగా మాట్లాడతున్నారని విమర్శించారు. యుపిఏ ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ఉందన్న ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణపై డిసెంబర్ 9వ తేదిన ఇచ్చిన మాటపై పెదవి విప్పాలన్నారు. తెలంగాణ విషయంలో కావాల్సింది మాటలు కాదని యాక్షన్ కావాలన్నారు. పార్లమెంటులో బిల్లు పెడితేనే తెలంగాణ ప్రజలు నమ్ముతారన్నారు.
కాంగ్రెసు, టిడిపి వైఖరి వల్లే డిసెంబర్ 23 ప్రకటన వచ్చిందని ఆరోపించారు. డిసెంబర్ 7న తెలంగాణకు అనుకూలమన్న చంద్రబాబు డిసెంబర్ 9న ప్రకటన రాగానే మాట మార్చారని ఆరోపించారు. కిరణ్, రోశయ్య, చంద్రబాబుల కుట్ర కారణంగానే కేంద్రం వెనక్కి పోయిందని మండిపడ్డారు. కాగా తెలంగాణ జిల్లాలలోని పలు చోట్ల జెఏసి ఆధ్వర్యంలో కేంద్రం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. విద్రోహ దినం ర్యాలీలలో బిజెపి, టిఆర్ఎస్ తదితర పార్టీ నేతలు పాల్గొన్నారు.