హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇండియా అమాయకుడు చిరు, బొత్సకు పావు: అంబటి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
హైదరాబాద్: ఆల్ ఇండియా అమాయకుడు తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు శుక్రవారం అన్నారు. రైతు సమస్యలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పిలుపు మేరకు అంబటి రాంబాబు గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చిరంజీవి ఆల్ ఇండియా అమాయకుడు అని, ఆయనను అడ్డం పెట్టుకొని పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ సిఎం సీటును పొందాలని అనుకుంటున్నారని విమర్శించారు. తనకు రావాల్సిన ముడుపులు మధ్యవర్తులకు అందుతున్నాయన్న అక్కసుతోనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సిండికేట్లపై ఎసిబి దాడులు చేయించారని విమర్శించారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని విమర్శించారు. చిత్తూరు జిల్లాలో తిరుపతి ఆర్డీవో కార్యాలయం ఎదుట పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆందోళన కార్యాక్రమాలలో ఆయా ప్రాంతాలలో పలువురు మాజీ ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. అనకాపల్లిలో ఎంపి సబ్బం హరి పాల్గొన్నారు.

English summary
YSR Congress Party spokes person Ambati Rambabu said that Chiranjeevi is all India innocent person.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X