హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పగటి వేషగాళ్లలా యాత్రలు: జగన్, బాబుపై కెటిఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

KT Rama Rao
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పగటి వేషగాళ్ల వలె యాత్రలు చేస్తున్నారని టిఆర్ఎస్ సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామా రావు శుక్రవారం విమర్శించారు. జెఏసి పిలుపు మేరకు తెలంగాణ విద్రోహ దినం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరాపార్కు వద్ద ఆయన మాట్లాడారు.

ఉద్యమానికి ఇది విరామమే కాని అంతం కాదన్నారు. 2014లో తెలంగాణ నినాదం మరోసారి రాకుండా వెంటనే కేంద్రం నిర్ణయం తీసుకోవాలన్నారు. తెలంగాణ ఉద్యమం నివురు గప్పిన నిప్పు అని అది ఎప్పటికీ చల్లారదన్నారు. ఇప్పటికే ఇరు ప్రాంతాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఇప్పటికైనా కేంద్రం తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. తెలంగాణ విషయంలో నలుగురు ముద్దాయిలు ఉన్నారన్నారు.

రాష్ట్రానికి అడ్డుపడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొదటి ముద్దాయి, వాగ్ధానాలు ఇచ్చి వెనక్కి పోయిన రాజకీయ పార్టీలు రెండో ముద్దాయి, సీమాంధ్ర పెట్టుబడిదారులు మూడో ముద్దాయి, వెన్నెముకలేని ప్రజాప్రతినిధులు నాలుగో ముద్దాయని విమర్శించారు. తెలంగాణకు త్వరలో ముగింపు పలకాలని ఆయన డిమాండ్ చేశారు.

English summary
TRS mla KTR blamed Kiran Kumar Reddy, Chandrababu Naidu and YS Jagan for their tour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X