మంత్రి శంకరన్న కొత్త నిరసన, కింద కూర్చుని విధులు

P Shankar Rao
హైదరాబాద్: జౌళి శాఖ మంత్రి పి. శంకరరావుకు మళ్లీ కోపం వచ్చింది. శుక్రవారం ఆయన వినూత్నమైన తీరులో నిరసన వ్యక్తం చేశారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో కింద కూర్చునే ఆయన విధులు నిర్వహించారు. తన ఛాంబర్‌లో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులు, సిబ్బంది కూడా కిందనే కూర్చున్నారు. ఛాంబర్‌లో కార్పెట్ పరిచి సమీక్షా సమావేశం నిర్వహించారు. తనకు ఫర్నీచర్ ఇవ్వనందుకు నిరసనగా ఆయన ఈ నిరసనకు శ్రీకాకరం చుట్టారు.

శంకరరావు ఇటీవల ఛాంబర్ మారారు. తనకు తగిన ఫర్నీచర్ ఇవ్వాలని కోరుతూ ఆయన సాధారణ పరిపాలనా శాఖ (జిఎడి)కి లేఖ రాశారు. అయితే, ఇప్పటి వరకు ఫర్నీచర్ రాలేదు. దీంతో ఆయన ఛాంబర్‌లో కింద కార్పెట్ పరిచి సమీక్షా సమావేశం నిర్వహించారు. శంకరరావు ఎప్పటికప్పుడు సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఆయన నేరుగానే విమర్శలు చేస్తూ వస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+