వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీ చెబుతున్నా మారే ఆలోచన లేదు: పురంధేశ్వరి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Purandeshwari
హైదరాబాద్: తనకు నియోజకవర్గం మారే ఆలోచన లేనేలేదని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి దగ్గుపాటి పురంధేశ్వరి సోమవారం ఓ ఛానల్ ముఖాముఖి చర్చలో చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కూడా తాను విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుండే పోటీ చేస్తానని చెప్పారు. తనకు ఎవరితో విభేదాలు లేవని, అసలు తాను వివాదాలకు దూరమని చెప్పారు. తాను ఇక్కడ స్థానికేతరురాలినని విపక్షాలు ప్రచారం చేసినా ప్రజాభిమానంతో గెలిచానని, 2014 ఎన్నికల్లో కూడా మళ్లీ ఇక్కడి నుండే పోటీ చేస్తానని చాలాసార్లు ఇప్పటికే చెప్పానని మళ్లీ అదే చెబుతున్నానని అన్నారు.

కాగా ఇటీవల రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామి రెడ్డి తాను వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేస్తానని ఆమె నరసారావు పేట లేదా బాపట్ల నియోజకవర్గాల్లో ఏదో ఒక చోటు నుంచి పోటీ చేయవచ్చునని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆమె కోసం నరసారావు పేట నియోజకవర్గం ఖాళీగా ఉందని వ్యాఖ్యానించారు.

English summary
Central Minister Purandeshwari said on monday that she will contest from Vishaka in next election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X