కిరణ్ రాజకీయం: ఓడిన మంత్రి ఆనం, గెలిచిన అధికారి

Kirankumar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనకు అత్యంత సన్నిహితులైన అధికారులను ప్రోత్సహిస్తూ మంత్రులను నిరుత్సాహపరుస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. అందుకు ప్రొఫెసర్ కెసి రెడ్డి ఉదంతాన్ని ఉదాహరణగా చెబుతున్నారు. ముఖ్యమంత్రి వద్ద ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట గెలువలేదు. కానీ అధికారి కెసి రెడ్డి మాట మాత్రం గెలిచింది. రాష్ట్ర రాజీవ్ గాంధీ విద్య, ఉపాధి కల్పనా మండలి వైస్ చైర్మన్ కెసి రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి మీద పైచేయి సాధించారు. 2014 నాటికి యువకులకు 15 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి కిరణ్ కుమార్ రెడ్డి ఆ మండలిని ఉద్దేశించారు. అది కిరణ్ కుమార్ రెడ్డి పెంపుడు పథకం.

పదేళ్లకు మించి ఏ అధికారి కూడా ఒకే శాఖలో ఉండకూడదని విధించిన నిబంధనను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కెసిరెడ్డి కోసం సడలించారని ఓ ఆంగ్ల దినపత్రిక రాసింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో గానీ, మంత్రులు కార్యాలయాల్లో గానీ ఓ ఉద్యోగి కూడా పదేళ్లకు మించి ఉండకూడదనే నిబంధనను ముఖ్యమంత్రి విధించారు. అయితే, కెసి రెడ్డి చలువ వల్ల రమణమూర్తికి మాత్రం ఆ నిబంధనను సడలించారని ఆ పత్రిక రాసింది. ఆయన మండలిలో అదనపు ప్రైవేట్ కార్యదర్సిగా కొనసాగడానికి వీలు కల్పించినట్లు తెలిపింది.

ఆ పత్రిక కథనం ప్రకారం - చాలా కాలంగా తనకు తెలిసిన అధికారిని తన కార్యాలయంలో పెట్టుకోవడానికి మాత్రం ఆనం రామనారాయణ రెడ్డికి సడలింపు లభించలేదు. ఆయన సర్వీసు పదేళ్లు మించిందనే ఉద్దేశంతో రామనారాయణ రెడ్డి విజ్ఞప్తిని ముఖ్యమంత్రి తోసిపుచ్చారు. దీంతో ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+