దక్షిణ కోస్తాకు, తమిళనాడులకు తుఫాను ముప్పు

తీరం వెంబడి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తుఫాను ప్రభావంతో వచ్చిన భారీ అలల వల్ల కోస్తా తీరంలోని 200 పడవలు దెబ్బ తిన్నాయి. తమిళనాడు ఉత్తర కోస్తా తీరంలో, పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్ల్లో ఈ నెల 28వ తేదీ నుంచి వర్షాలు పడే అవకాశం ఉంది. మంగళవారం రాత్రి నుంచే అవి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications