హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దక్షిణ కోస్తాకు, తమిళనాడులకు తుఫాను ముప్పు

By Pratap
|
Google Oneindia TeluguNews

Cyclone
హైదరాబాద్: రాష్ట్రంలోని దక్షిణాంధ్రకు, తమిళనాడుకు తుఫాను ముప్పు పొంచి ఉంది. ఈ నెల 30వ తేదీ నాటికి తుఫాను తాకిడి ఉంటుందని వాతావరణ పరిశోధనా కార్యాలయం చెబుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారింది. దీనికి థేన్ అని నామకరణం చేశారు. ప్రస్తుతం చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 800 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉంది. ఈ నెల 30వ తేదీన కడలూరు, నెల్లూరు మధ్య అది తీరం దాటే అవకాశం ఉంది. తుఫాను ప్రభావంతో రేపట్నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురుస్తాయి.

తీరం వెంబడి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తుఫాను ప్రభావంతో వచ్చిన భారీ అలల వల్ల కోస్తా తీరంలోని 200 పడవలు దెబ్బ తిన్నాయి. తమిళనాడు ఉత్తర కోస్తా తీరంలో, పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌ల్లో ఈ నెల 28వ తేదీ నుంచి వర్షాలు పడే అవకాశం ఉంది. మంగళవారం రాత్రి నుంచే అవి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

English summary
The south Andhra and north Tamil Nadu coast is facing the threat of a cyclone later in the week with a cyclonic storm formation in the Bay of Bengal likely to intensify and hit the coast between Tamil Nadu and Andhra on December 30, the weather office said on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X