విచారణకు శ్రీలక్ష్మి సహకరించడం లేదు: సిబిఐ వాదన
సిబిఐ తరఫు న్యాయవాది వాదనలు శ్రీలక్ష్మి న్యాయవాది తప్పు పట్టారు. శ్రీలక్ష్మి పరిశ్రమల శాఖ అధికారిగా చార్జ్ తీసుకోక ముందే ఓఎంసికి లీజులు అందాయన్నారు. బెయిల్పై విడుదలయ్యాకు ఆమె ఎవరినీ బెదిరించలేదని అలాంటప్పుడు ఆమె, ఆమె భర్త సాక్షులను బెదిరిస్తారన్న సిబిఐ వాదనలో అర్థం లేదన్నారు. ఓఎంసికి అనుకూలంగా వ్యవహరించిందన్న వాదనలకు సిబిఐ వద్ద ఆధారాలు లేవన్నారు. కాగా ఇరువురి వాదనలు పూర్తయ్యాయి. నిర్ణయాన్ని కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. కాగా గాలి జనార్షన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిల బెయిల్ పిటిషన్ కేసును కోర్టు 30వ తేదికి వాయిదా వేసింది.
Comments
English summary
CBI's lawyer argue in High Court that Srilaxmi is not cooperating for enquiry.
Story first published: Wednesday, December 28, 2011, 14:37 [IST]