సబిత ఇంద్రా రెడ్డిపై గవర్నర్‌కు శంకరరావు ఫిర్యాదు

P Shankar Rao
హైదరాబాద్: చేనేత, జౌళీ శాఖ మంత్రి శంకరరావు బుధవారం హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డిపై గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. ఇటీవల శంకరరావుపై ఎన్టీఆర్ నగర్‌లో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడికి సబితా ఇంద్రా రెడ్డియే కారణమని ఆయన ఆరోపిస్తున్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగతో కలిసి శంకరరావు బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. ఓ భూవివాదం కేసులో జహంగీర్‌కు అండగా వెళ్తే హోంమంత్రి అనుచరులు తనపై దాడికి పాల్పడ్డారని తెలిపారు. తాను దళితుడినని, తనను అవమానించేరీతిలో బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టి అవమానించారని ఫిర్యాదు చేశారు.

ఈ విషయంలో హోంమంత్రి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి శంకరరావుపై దాడికి నిరసనగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో రెండు రోజుల క్రితం ఎల్బీ నగర్‌లో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించారు. తాను అవినీతిపై పోరాటం చేస్తున్నందునే దాడి జరిగిందని, అయినప్పటికీ తన పోరాటం ఆపేది లేదని శంకరరావు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+