నేరాలు పెరిగాయి, ఇది వరల్డ్ ట్రెండ్: దినేష్ రెడ్డి

Dinesh Reddy
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా నిరుటి కన్నా ఏ ఏడాది నేరాలు పెరిగాయని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) దినేష్ రెడ్డి చెప్పారు. నేరాల శాతం 5.8 పెరిగిందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ఎపిపియస్‌సి ద్వారా ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించిందని, వాటి బహిష్కరణకు పిలుపునివ్వడంతో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడే పరిస్థితి ఏర్పడిందని, దాన్ని తాము సమర్థంగా ఎదుర్కున్నామని ఆయన చెప్పారు. ర్యాగింగ్ కేసులు పెరగగా, వరకట్నం వేధింపుల కేసులు తగ్గాయని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నేరాలు పెరిగాయని డిజిపి అంగీకరించారు. నకిలీ కరెన్సీ కేసులు తగ్గాయని ఆయన చెప్పారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 2522 హత్యలు జరిగినట్లు ఆయన తెలిపారు. నిరుటితో పోల్చుకుంటే రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఆర్థిక నేరాలు పెరిగాయని ఆయన చెప్పారు.

డ్రగ్ కేసులు పెరిగాయని, ఈ ఏడాది డ్రగ్ కేసుల్లో 600 మందిని అరెస్టు చేశామని ఆయన చెప్పారు. సంస్కరణలు, ఆవిష్కరణలను పోలీసు శాఖలో ప్రవేశపెడుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి దేశంలోనూ ఏడాదికి ఏడాదికీ నేరాలు పెరుగుతున్నాయనే విషయాన్ని గుర్తించాలని ఆయన అన్నారు. ఆందోళనల సందర్భంగా ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చట్టవ్యతిరేక చర్యలను అడ్డుకున్నామని ఆయన చెప్పారు. రోడ్డు ప్రమాదాలు 39,324, హత్యలు 2522 జరిగాయని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+