చంద్రబాబు కుప్పం గోడు, వివక్ష అంటూ విమర్శ

Chandrababu Naidu
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం గోడును వినిపించుకున్నారు. తన నియోజకవర్గం కుప్పం పట్ల ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందని ఆయన విమర్శించారు. కుప్పం పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని ఆయన అన్నారు. కుప్పాన్ని ఓ విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు ఆయన తెలిపారు. వ్యవసాయం లాభసాటిగా మారే వరకు తాను పోరాటం చేస్తానని ఆయన చెప్పారు. మద్యం సిండికేట్లలో కాంగ్రెసు నాయకులు 5 వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆయన ఆరోపించారు. మంగళవారంనాడు ఆయన కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. రాష్ట్రంలో అసమర్థ పాలన సాగుతోందని, దాంతో అభివృద్ధి వేగం ఆగిపోయిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో మద్యం మాఫియా పేదల రక్తాన్ని పిండుకుంటోందని ఆయన అన్నారు. అయిదు వేల కోట్ల రూపాయల మద్యం సిండికేట్ల అక్రమాలే అందుకు నిదర్శనమని ఆయన అన్నారు. కాంగ్రెసు పాలనలో కరెంట్ కోతలు తీవ్రం కావడంతో వ్యవసాయం చేయలేని పరిస్థితి దాపురించిందని ఆయన అన్నారు.

తన తొమ్మిదేళ్ల పాలనలో రోజుకు 9 గంటలు విద్యుత్ సరఫరా చేశామని ఆయన గుర్తు చేశారు. విద్యుత్ చార్జీల పెంపు ద్వారా ప్రజలపై ప్రభుత్వం రూ. 10 వేల కోట్ల భారం మోపుతోందని ఆయన విమర్శించారు. సూక్ష్మ రుణాల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని ఆయన అన్ారు. కాంగ్రెసు పాలనలో ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ఓ పక్క వ్యవసాయ పెట్టుబడి ఖర్చులు పెరుగుతుండగా, మరో వైపు రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని ఆయన అన్నారు. ప్రజలపై ప్రభుత్వం పన్నుల భారం మోపుతోందని, రెండేళ్ల తర్వాత ఈ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిసి పోవడం ఖాయమని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+