హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిబిఐ కస్టడీకి విజయ సాయి, విచారణకు షరతులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Vijaya Sai Reddy
హైదరాబాద్: వైయస్ జగన్ ఆస్తుల కేసులో అరెస్టయిన జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయిరెడ్డిని ఐదు రోజుల పాటు సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ హైదరాబాదులోని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 9వ తేదీ వరకు ఆయనను సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రతి రోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే విజయ సాయి రెడ్డిని విచారించాలని కోర్టు షరతు పెట్టింది. విచారణ న్యాయవాది సమక్షంలోనే జరగాలని ఆదేశించింది. సిబిఐ కార్యాలయంలో విజయ సాయి రెడ్డిని విచారించాలని సూచించింది.

విజయ సాయి రెడ్డిని ప్రతి రోజు ఉదయం హైదరాబాదు చంచల్‌గుడా జైలు నుంచి తీసుకుని వచ్చి విచారించిన తర్వాత మళ్లీ జైలుకు పంపించాలని కోర్టు సిబిఐని ఆదేశించింది. విజయ సాయి రెడ్డి అరెస్టు వెనక రాజకీయ దురుద్దేశం ఉందని విజయ సాయి రెడ్డి తరఫు న్యాయవాది ఆరోపించారు. పబ్లిక్ సర్వెంట్స్‌ను ఎవరినీ అరెస్టు చేయకుండా విజయ సాయి రెడ్డిని అరెస్టు చేయడం ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని ఆయన వాదించారు. విచారణ సమయంలో విజయ సాయి రెడ్డికి వైద్య పరీక్షలు అందించాలని, మధ్యాహ్న భోజనం సమకూర్చాలని కోర్టు సిబిఐని ఆదేశించింది.

English summary
Nampally Court ordered CBI custody to Vijaya Sai Reddy in YS Jagan assets case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X