త్వరలో సిబిఐ ఎదుటకు అంబటి!: ఫోన్ ద్వారా పిలుపు

సిబిఐ నుంచి తనకు పిలుపు వచ్చింది నిజమేనని, అయితే విచారణకు హాజరు కావాలని లిఖితపూర్వకంగా ఆదేశాలు అందలేదని, ఫోన్ ద్వారా మాత్రమే తనకు సమాచారం ఇచ్చారని అంబటి రాంబాబు చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో బుధవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. సిబిఐ అధికారి ఒకరు తనకు ఫోన్ చేసి 8వ తేదీన విచారణకు హాజరుకావాలని చెప్పారని అన్నారు. తనను సాక్షిగా పిలిచారో లేక ముద్దాయిగా పిలిచారో, నోటీసు వస్తేగానీ తెలియదన్నారు.












Click it and Unblock the Notifications