విజయ సాయి రెడ్డిని ప్రశ్నించిన సిబిఐ అధికారులు
కాగా, తనను ప్రత్యేక ఖైదీగా గుర్తించాలని కోరుతూ విజయ సాయి రెడ్డి గురువారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణను కోర్టు వాయిదా వేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐని ఆదేశించింది. విజయ సాయి రెడ్డిని ఐదు రోజుల పాటు సిబిఐ కస్టడీకి అప్పగించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మిని నిందితురాలిగా చేర్చకుండానే సిబిఐ ఈ చార్జిషీట్ దాఖలు చేసింది. కేసులో శ్రీనివాస రెడ్డిని మొదటి ముద్దాయిగా, గాలి జనార్దన్ రెడ్డిని రెండో ముద్దాయిగా, రాజగోపాల్ను మూడో ముద్దాయిగా, ఒఎంసిని నాలుగో ముద్దాయిగా, లింగారెడ్డిని ఐదో ముద్దాయిగా చేర్చింది. ఇందులో లింగారెడ్డి మరణించారు. అప్పటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని, అధికారి దయాకర్ రెడ్డిని తదితరులను సాక్షులుగా పేర్కొంది. మొత్తం 201 మంది సాక్షులను సిబిఐ చార్జిషీట్లో చేర్చింది.