ఆజాద్పై టి-కాంగ్ ఎంపీలు గుర్రు, బాబు యాత్రపై ఫైర్

బాబుకు ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారని టిటిడిపి నేతలు అంటున్నారని కానీ అంతమంది పోలీసులతో వెళ్లడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. బాబువి అవకాశవాద రాజకీయాలని, ప్రజలు వ్యతిరేకిస్తున్నా టిటిడిపి నేతలు చెంచాలుగా మారి బాబును జిల్లాకు తీసుకు వస్తున్నారన్నారు. తెలంగాణకు వ్యతిరేకం కాదన్న ఆయన అనుకూలంగా ఎందుకు ప్రకటన చేయరన్నారు. ఇతర జిల్లాల టిడిపి కార్యకర్తలు ఆ జిల్లా వారిపై పోలీసు సమక్షంలో దాడులు చేస్తున్నారని విమర్శించారు. రాజకీయ ఉనికి కోసమే యాత్ర అని, అయినా ప్రజలు బాబును నమ్మే స్థితిలో లేరన్నారు. తాము కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తామని, బాబును అడ్డుకోమని చెప్పమని, అయితే టిడిపి దాడులు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications