నేనే నేరుగా వస్తా: తెరాస టార్గెట్‌గా చంద్రబాబు

Chandrababu Naidu
వరంగల్: తెలంగాణలో ఉప ఎన్నికల ప్రచారానికి తానే నేరుగా వస్తానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ను లక్ష్యంగా చేసుకుని వరంగల్ జిల్లా పర్యటనలో ఆయన శుక్రవారం మాట్లాడారు. ఇక తెరాస ఆటలు సాగవని ఆయన హెచ్చరించారు. తెరాసకు విధివిధానాలు లేవని ఆయన అన్నారు. తెరాస కన్నా తమ పార్టీకే తెలంగాణలో పటిష్టమైన నాయకత్వం ఉందని ఆయన అన్నారు. కొన్ని రాజకీయ పరిణామాల ప్రభావం వల్ల తన తెలంగాణ పర్యటనలో జాప్యం జరిగిందని ఆయన చెప్పారు. తెలంగాణ జిల్లాల్లో క్రమం తప్పకుండా పర్యటిస్తానని ఆయన చెప్పారు. తెరాస కావాలనే గిల్లికజ్జాలు పెట్టుకుంటోందని ఆయన అన్నారు. రైతు సంక్షేమం కోసం తాను వస్తున్నానని ఆయన అన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా తాను వెనక్కి తగ్గేది లేదని ఆయన తేల్చి చెప్పారు.

ఉప ఎన్నికల్లో తమ పార్టీ అన్ని సీట్లకు పోటీ చేస్తుందని ఆయన చెప్పారు. రైతులపై ప్రేమ ఉంటే వారు కూడా పోరాడాలని, వారు పోరాడకుండా పోరాడేవారిపై దాడికి దిగుతున్నారని ఆయన అన్నారు. రాజకీయంగా తమను ఎదుర్కోలేక అలా చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రజల కష్టనష్టాలు తెలుసుకునేందుకు వస్తుంటే తెలంగాణ అంటూ అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు. తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పినా అడ్డుకుంటే ఎలా అని ఆయన అడిగారు. లక్ష్మక్కపల్లి నుంచి ఆయన తన రైతు పోరుబాటను ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీపై ప్రజలకు అచంచల విశ్వాసం ఉందని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+