వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సజీవంగా శిలువ వేయించుకున్న మహిళ

By Pratap
|
Google Oneindia TeluguNews

Guntur District
గుంటూరు: గుంటూరు జిల్లాలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. తన భర్త, భక్తుల సహకారంతో ఓ మహిళ సజీవంగా శిలువ వేయించుకుంది. ఈ సంఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి గ్రామంలో జరిగింది. క్రీస్తు తనకు కలలో కనిపించి, శిలువ వేయించుకుంటే తన వద్దకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుందని చెప్పాడని చెప్పి శిలువ వేసుకునేందుకు సహకరించాలని మరియమ్మ భర్తను కోరింది. దీంతో భర్త ఆమెకు శిలువ వేసేందుకు సిద్ధపడ్డాడు. కొంత మంది భక్తులు కూడా అందుకు సహకరించారు. ఆమెను శిలువపై ఉంచి మేకులు కూడా దిగగొట్టారు. దాదాపు గంట పాటు ఆమె శిలువపై ఉన్నట్లు కొన్ని టీవి చానెళ్లలో వార్తలు వచ్చాయి. విషయం తెలిసిన పోలీసులు రంగంలోకి దిగి భార్యాభర్తలను అదుపులోకి తీసుకున్నారు.

తాను శిలువ వేసుకున్నా తనకు రక్తం కారలేదని ఆమె పోలీసులకు చెప్పింది. గాయపడిన మరియమ్మకు పోలీసులు చికిత్స చేయించారు. మరియమ్మ భక్తులకు చికిత్స కూడా చేస్తుంది. వారం వారం ఆమె వద్దకు భక్తులు వస్తుంటారు. భక్తుల సంఖ్య పెరగాలంటే సజీవంగా శిలువ వేయించుకోవాలని క్రీస్తు కలలో కనిపించడం వల్లనే తాను ఆ పనికి దిగానని మరియమ్మ చెబుతోంది. మరియమ్మ వ్యవహారానికి సంబంధించిన వార్తాకథనాన్ని తెలుగు టీవీ చానెళ్లన్నీ ప్రసారం చేశాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా ప్రసారమయ్యాయి. ఆమెను శిలువ వేసిన దృశ్యాలు ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్‌లో ప్రసారమయ్యాయి. శిలువపై పరుండ బెట్టి అరచేతులపై మేకులు దిగబెట్టిన దృశ్యాలు కనిపించాయి.

English summary
A woman Cross fried alive in Tadepalli village of Guntur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X