హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ఇష్యూ: కిరణ్ కుమార్‌పై శివమెత్తిన శంకరన్న

By Pratap
|
Google Oneindia TeluguNews

P Shankar Rao
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై రాష్ట్ర జౌళి శాఖ మంత్రి పి. శంకరరావు మరోసారి ధ్వజమెత్తారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ విమర్శిస్తున్నా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని ఆయన అడిగారు. బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేస్తారని ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మిని జైలుకు పంపించారని, అదే న్యాయం జగన్‌కు ఎందుకు వర్తించదని, జగన్ బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేయరా అని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉన్నందున జగన్‌ను అరెస్టు చేయాలని కోర్టులో పిటిషన్ వేస్తానని ఆయన చెప్పారు.

హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై కూడా ఆయన విరుచుకుపడ్డారు. మద్దెలచెర్వు సూరి హత్య కేసులో సబితా ఇంద్రా రెడ్డి కుమారుడు కార్తిక రెడ్డి పాత్ర బయటపడుతుందనే ఉద్దేశంతోనే భాను కిరణ్‌ను పోలీసులు అరెస్టు చేయడం లేదని ఆయన అన్నారు. పోస్టింగుల్లో సబితా ఇంద్రా రెడ్డి డబ్బులు వసూలు చేశారని ఆయన ఆరోపించారు.

English summary
Minister P Shankar Rao lashed out at CM Kiran Kumar Reddy once again.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X