వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పయ్యావుల కేశవ్ సవాల్‌కు అంబటి రాంబాబు సై

By Pratap
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
హైదరాబాద్: ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో తనపై వచ్చిన అభియోగాలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు పయ్వావుల కేశవ్‌కు సవాల్ విసిరారు. తనపై వచ్చిన అభియోగాలపై తాను బహిరంగ చర్చకు సిద్దంగా ఉన్నట్లు ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తెలిపారు. పయ్యావుల కేశవ్ సవాల్‌ను ఎదుర్కునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలోనే ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారాలకు పాదులు పడ్డాయని ఆయన ఆరోపించారు. సుప్రీంకోర్టు ముందు చంద్రబాబు ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంపై చెప్పుకోవాలని ఆయన అన్నారు.

బహిరంగ చర్చకు ఎపిఐఐసి చైర్మన్ శివరామ సుబ్రహ్మణ్యం కూడా రావచ్చునని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మెప్పు పొంది తన పదవీ కాలాన్ని పొడగించుకోవడానికే శివరామ సుబ్రహ్మణ్యం తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. తనపై అవాకులు చెవాకులు పేలితే ముఖ్యమంత్రి తన పదవీ కాలాన్ని పొడగిస్తారని శివరామ సుబ్రహ్మణ్యం అనుకుంటున్నారని ఆయన అన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో తనకు వ్యతిరేకంగా ఆధారాలుంటే సిబిఐకి ఇచ్చుకోవచ్చునని ఆయన అన్నారు. సిబిఐకి తాను చెప్పాల్సింది చెప్పానని ఆయన అన్నారు.

English summary
YSR Congress spokesperson Ambati Rambabu expressed his readinees to TDP MLA Payyavula Keshav's challenge.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X