జగన్ వర్గంపై ఏ క్షణమైనా నిర్ణయం, సిద్ధం కండి!: బాబు

ఈ నెల 19, 20, 21 తేదీల్లో నియోజకవర్గాల్లో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించి సభ్యత్వాల నమోదు, పునరుద్ధరణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని ఈ భేటీలో నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. మహిళలకు, యువతకు సభ్యత్వంలో ప్రాధాన్యత ఇవ్వాలని బాబు వారికి సూచించారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమించి పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని బాబు వారికి సూచించారు. అవినీతి, భూములు, విద్యుత్తు, రైతు సమస్యలు, ఫీజుల రీయింబర్స్మెంట్ తదితర స్థానిక అంశాలపై శాసనసభా నియోజకవర్గాలు, జిల్లా స్థాయిల్లో ఉధృత పోరాటాలు నిర్వహించాలని చెప్పారు. జిల్లాల్లో ప్రస్తుత సమస్యలపై ఎప్పటికప్పుడు పోరును ఉధృతం చేయాలని, ఉప ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని ఆదేశించారు. సరిగా పని చేయని వారిపై బాబు సీరియస్ అయ్యారని సమాచారం.












Click it and Unblock the Notifications