వైయస్సార్ పథకాన్ని టార్గెట్ చేసిన చంద్రబాబు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వల్లనే రైతులు రాష్ట్రంలో రైతులు క్రాప్ హాలీడే ప్రకటించారని అన్నారు. మిగిలిన జిల్లాల్లోనూ తన రైతు పోరు బాట యాత్రను త్వరలో పూర్తి చేస్తానని చెప్పారు. రైతు సమస్యలను జాతీయ స్థాయికి తీసుకు వెళ్లిన ఘనత టిడిపిదేనన్నారు. కిరణ్ ప్రవేశ పెట్టిన రాజీవ్ యువకిరణాలు ఓ బూటకమన్నారు. పోలవరం టెండర్లకు సంబంధించిన ఫైల్ను స్పీకర్ నాదెండ్ల మనోహర్ కుమార్ ముందు పెడితే అందులో జరిగిన అక్రమాలు నిరూపిస్తామన్నారు. టెండర్లలో టిఆర్ఎస్, సిఎం కలిసి గోల్ మాల్ చేశారని ఆరోపించారు. విద్యుత్ ఛార్జీలు పెంచడం దారుణమన్నారు. కాంగ్రెసు తీరు చూస్తుంటే ఇది ప్రజాస్వామ్యమా రాచరిక వ్యవస్థనా అనే అనుమానం వస్తుందన్నారు. జలయజ్ఞం రైతుల కోసం కాకుండా అవినీతి కోసమేనన్నారు. దివంగత ఎన్టీఆర్ ఇదే రోజు 1983లో సిఎంగా ప్రమాణ స్వీకారం చేశారని, ఈ రోజు నుండి మనం విభేదాలు మరిచి సమన్వయంతో వెళదామని కార్యకర్తలకు సూచించారు.












Click it and Unblock the Notifications