మీకో దండం, తెలంగాణపై అడుగొద్దు: జైపాల్ రెడ్డి

తాను ఉప రాష్ట్రపతి పదవికి రేసులో లేనని, అవన్నీ ఊహాగానాలు మాత్రమేనని ఆయన కొట్టిపారేశారు. ఈ విషయంలో వార్తలు సృష్టించి, రాసేస్తున్నారని ఆయన అన్నారు. జాతీయ స్థాయిలో అవసరం మేరకు పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం నుంచి జైపాల్ రెడ్డి లోకసభకు ఎన్నికయ్యారు. తెలంగాణపై పెరుగుతున్న ఒత్తిడితో ఆయన క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకోవచ్చుననే వార్తలు ఇటీవల వచ్చాయి. అలా తప్పుకుంటూ ఉప రాష్ట్రపతి పదవికి రేసులో ఉంటారని కూడా వార్తాకథనాలు వచ్చాయి.












Click it and Unblock the Notifications