థియేటర్లు ఇవ్వకుంటే సినిమాలు అడ్డుకుంటాం: కెసిఆర్

మహిళలను వంటింటికి పరిమితం చేయకుండా వారికి అన్ని విషయాల్లో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పరిశ్రమలలో స్థానికులకు తొంబై శాతం ఉద్యోగాలు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక పరిశ్రమలను ప్రోత్సహిస్తూ వాటిల్లో తొంబై శాతం స్థానికులకే ఇస్తామన్నారు. తెలంగాణకు చెందిన ప్రైవేట్ ఉద్యోగులను వేధిస్తే వారి యాజమాన్యాల భరతం పడతామని, వెంటపడుతామని కెసిఆర్ హెచ్చరించారు. స్థానిక సంస్థలతోపాటు, చట్ట సభల్లోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఉండాల్సిందేనన్నారు. మహిళా బిల్లు తీసుకొస్తే తమ పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పారు. తెలంగాణ కోసం ఎన్ని రకాలుగా ఉద్యమం చేసినప్పటికీ తోలు మందం ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఒకవైపు చంద్రబాబు, మరోవైపు జగన్ ఉద్యమాన్ని అయోమయానికి గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.
తెలంగాణ సాధించే వరకు టిఆర్ఎస్ విశ్రమించదన్నారు. ఎనిమిది వందల మంది చనిపోయినా కేంద్రం స్పందించక పోవడం శోచనీయమన్నారు. ప్రజాభిప్రాయంపై కేంద్రానికి గౌరవం లేదన్నారు. ఈ నెల 18, 19 తేదీల్లో జెఏసి సమావేశాన్ని ఏర్పాటుచేసి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ ఖరారు చేస్తామన్నారు. మళ్లీ సమ్మె చేయటానికి ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారన్నారు. తెలంగాణ సాధన పోరాటంలో మహిళలు, ప్రైవేట్ ఉద్యోగులు చురుగ్గా ముందుండాలని కోరారు.












Click it and Unblock the Notifications