అంబటి రాంబాబుది అతితెలివన్న పయ్యావుల

ఎమ్మార్లో అంబటి రాంబాబు పాత్ర స్పష్టమైందన్నారు. సిబిఐ విచారణలో అన్నీ వెల్లడవుతాయన్నారు. భువితేజ బయటకు వస్తే రాంబాబు చరిత్ర బట్టబయలవుతుందన్నారు. ప్రజాధనం టూఠీ చేసిన వారు చంద్రబాబు పైన విమర్శలు చేస్తారా అని ప్రశ్నించారు. కాగా మద్యం మాఫియాపై ఎసిబి నివేదిక బయటపెట్టి ఉంటే మైలవరం సంఘటన జరిగి ఉండేది కాదని మరో నేత దేవినేని ఉమా మహేశ్వర రావు అన్నారు. నివేదిక బయట పెడితే ప్రభుత్వం కూలుతుందనే భయంతోనే మీనమేషాలు లెక్కిస్తున్నారన్నారు. కల్తీసారా కారణంగా 19 మంది చనిపోతే ప్రభుత్వం నుండి ఎవరూ పరామర్శించలేదని, కనీసం స్థానిక ఎంపీ లగడపాటి రాజగోపాల్ పరామర్శించలేదని విమర్శించారు. పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ మాఫియా కింగ్ అని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications