జగన్ తెలంగాణ దీక్ష టెన్షన్, చంద్రబాబు పంథానే

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తెలంగాణ పర్యటనపై తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. తెలంగాణవాదులు హెచ్చరికలు చేస్తున్నా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో రైతు దీక్ష చేపట్టడానికే వైయస్ జగన్ నిర్ణయించుకున్నారు. వైయస్ జగన్ పర్యటనకు నిరసనగా రేపు మంగళవారం తెలంగాణ రాజకీయ జెఎసి నిజామాబాద్ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. జగన్ పర్యటనను అడ్డుకుంటామని తెలంగాణ రాజకీయ జెఎసితో పాటు విద్యార్థి జెఎసి కూడా ప్రకటించింది. జగన్‌ను అడ్డుకోవాలని కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు మధు యాష్కీ, పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. జగన్ పర్యటనకు నిరసనగా సోమవారం విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అయినా జగన్ వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.

జగన్ దీక్ష అడ్డుకోవద్దని, జగన్ తెలంగాణకు వ్యతిరేకం కారని వైయస్సార్ కాంగ్రెసు తెలంగాణ నాయకులు కోరుతూనే ఆర్మూర్‌లో జగన్ దీక్షకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాను చేపట్టబోయే దీక్షపై వైయస్ జగన్ సోమవారం పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వరంగల్ జిల్లా పర్యటన విషయంలో అనుసరించిన పంథానే తన ఆర్మూర్ పర్యటన విషయంలో అనుసరించాలని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణవాదుల హెచ్చరికలను సవాల్‌గా స్వీకరించి ఆర్మూర్‌లో దీక్ష చేపట్టాలనే పట్టుదలతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.

వైయస్ జగన్ రేపు మంగళవారం ఉదయం 7 గంటలకు హైదరాబాదు నుంచి బయలుదేరుతారు. దారిలో తనను చూసేందుకు వేచి చూసే ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగాలా, చడీచప్పుడు కాకుండా ఆర్మూర్ చేరుకోవాలా అనే సందేహంతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయం 11 గంటలకు ఆయన ఆర్మూర్ చేరుకుంటారని భావిస్తున్నారు. రేపు ఉదయం 11 గంటల నుంచి 48 గంటల పాటు ఆయన రైతు దీక్ష సాగుతుంది. అయితే, జగన్ పర్యటన సందర్భంగా ఏ విధమైన సంఘటనలు చోటు చేసుకుంటాయోననే ఉత్కంఠ నెలకొని ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+