గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవి విలీనమైతే, బాబు అమ్ముడు పోయారు: జగన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
గుంటూరు: తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తే, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెసుకు అమ్ముడు పోయారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపై వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం గుంటూరు జిల్లా ఓదార్పుయాత్రలో విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విషయాల్లో వైఫల్యం చెందినప్పుడు ఏమైనా స్పందిస్తుందోనని అందరూ ప్రతిపక్షం వైపు చూశారని, కానీ ఆ ప్రతిపక్షం ఎప్పుడో అధికార పార్టీకి అమ్ముడు పోయిందన్నారు. కాంగ్రెసు ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని పూర్తిగా నమ్మకం వచ్చిన తర్వాతే చంద్రబాబు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టారని విమర్శించారు. తనను, తన పార్టీని నాశనం చేయాలని చంద్రబాబు, కాంగ్రెసు పెద్దలు నీచమైన ఆలోచనలు చేశారని, కానీ తన వర్గం ఎమ్మెల్యేలు మాత్రం మాటకు కట్టుబడి రైతుల కోసం అవిశ్వాసానికి మద్దతుగా ఓటేశారన్నారు.

మనం రైతుల కోసం ఓటు వేస్తున్నామని అలాంటప్పుడు ప్రజల అండదండలు మనకు ఎప్పుడూ ఉంటాయని, వైయస్సార్ బాటలో నడవాలనుకున్న ప్రతి ఒక్కరూ అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయాలని తన ఎమ్మెల్యేలకు సూచించానని వారు నా మాటకు గౌరవం ఇచ్చారన్నారు. దివంగత వైయస్‌కు ముందు చాలామంది ముఖ్యమంత్రులు వచ్చారు, కానీ ఎవరూ ప్రాజెక్టుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. రాష్ట్రంలో, రైతులు, రైతు కూలీల పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు. రైతన్నల మీద సానుభూతి చూపించాల్సిన ప్రభుత్వం రైతులను, కూలీలను గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy blamed TDP chief Nara Chandrababu Naidu that he sell his party to Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X